19-06-2025 08:47:16 PM
మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేష్..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో యోగా సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆయు ప్రమాణం కూడా పెరిగి మనిషి ఆరోగ్యంగా ఉంటాడని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేష్ నాయక్(Mandal Medical Officer Dr. Bhukya Nagesh Nayak) చెప్పారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా డే(International Yoga Day) సందర్బంగా గురువారం మండల కేంద్రం అర్వపల్లిలోని పీహెచ్సీలో ఆశా వర్కర్లకు, ఆరోగ్య సిబ్బందికి యోగపై అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ... ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గ్రామాల్లోని ప్రజలకు ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్ సునీత, ఏఎన్ఎంలు, వివిధ గ్రామాల ఆశాలు తదితరులు పాల్గొన్నారు.