19-06-2025 08:50:49 PM
జీఎంపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: ఎన్నికల్లో గొల్ల కురుమలకు ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం(జీఎంపీఎస్)జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రం అర్వపల్లిలో ఈనెల 26న జిల్లా కేంద్రం సూర్యాపేటలోని దురాజ్పల్లి లింగమంతుల స్వామి దేవస్థానం ఆవరణలో జరిగే ఆసంఘం జిల్లా 3వ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వం గొల్ల కురుమలకు ఒక్క విడతలో గొర్రెలు పంపిణీ చేసి 2వ విడతలో పంపిణీ చేయకుండా మోసం చేసినందుకే కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పి రేవంత్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ప్రస్తుత ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే నడిచి గొల్ల కురుమలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గొల్ల కురుమలకు రెండో విడతగా రూ.2 లక్షల రూపాయల నగదును లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని, లేనియెడల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆసంఘం జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు వజ్జె వినయ్ యాదవ్, నాయకులు బొబ్బలి లింగమల్లు, ఆంజనేయులు, వెంకన్న, వీరపాపయ్య, లింగయ్య, సోమయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.