21-06-2025 02:30:40 PM
-ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి
ఖమ్మం,(విజయక్రాంతి): మానసిక ప్రశాంతతకు, శారీరక ఉల్లాసానికి, మంచి ఆరోగ్యానికి యోగా దివ్య ఔషధం మాదిరిగా పనిచేస్తుందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి(Ramasahayam Raghuram Reddy) అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. శనివారం ఉదయం ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ యోగా అనేది ఆరోగ్యానికి ఒక క్రమశిక్షణాయుతమైన దినచర్య అని అన్నారు. మన దేశంలో ఆరంభమై ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని తెలిపారు. మహిళలు సైతం ప్రత్యేక శ్రద్ధతో యోగా తరగతులు నిర్వహిస్తుండడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో యోగా క్లాసుల నిర్వాహకులు శ్రీలత, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, మహిళా నాయకురాలు చల్లా ప్రతిభారెడ్డి, కార్పొరేటర్లు, టీఏసీ మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు కమతం రామకృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు.