calender_icon.png 10 June, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధతో యువ రైతు మృతి

10-06-2025 12:00:00 AM

కోనరావుపేట, జూన్ 9 (విజయక్రాంతి):అప్పుల బాధతో యువ రైతు మృతిచెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోన రావుపేట మండలంలోని ధర్మారంగ్రామం లో జరిగింది. గ్రామానికి చెందిన అన్నవేనీ తిరుపతి(36)అనే యువ రైతు గ్రామంలో నే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పో షించుకుంటున్నాడు.

ఆర్థిక ఇబ్బందులు, అ ప్పుల బాధతో తీవ్ర మనస్తాపం చెందిన తి రుపతి ఈ నెల 5 న ఇంట్లో గడ్డి మందుతాగాడు.గమనించిన కుటుంబ సభ్యులు ఎ ల్లా రెడ్డిపేటలో ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు.మృతునికి భార్యలతిక కూతురు హన్సిక, కుమారుడు ఉన్నా రు. మృతునికి తల్లి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ ఐ ప్రశాంత్ రెడ్డితెలిపారు.