13 May, 2026 | 10:09 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు

13-05-2026 09:02 PM

పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్న నిందితుడు అరెస్ట్ - రిమాండ్

అక్కన్నపేట ఎస్సై చాతరాజు ప్రశాంత్

హుస్నాబాద్: అక్కన్నపేట మండల పరిధిలో ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన యువకుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన ఉస్తేం ప్రవీణ్ (22) అనే యువకుడు, అక్కన్నపేట మండలం బొడిగెపల్లికి చెందిన ఓ యువతితో ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆ నమ్మకంతో బాధితురాలిని శారీరకంగా లొంగదీసుకున్న అనంతరం, పెళ్లి విషయానికి వచ్చేసరికి ముఖం చాటేశాడని అక్కన్నపేట ఎస్సై చాతరాజు ప్రశాంత్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి  పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.