5 April, 2026 | 6:19 PM

మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌

05-04-2026 11:48 AM

హైదరాబాద్: మాదాపూర్ లో మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌ చేశారు. ఆదివారం ఉదయం పటాన్ చెరు నుంచి కోఠికి వెళ్తున్న బర్కత్ పురా డిపో బస్సు కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ మొయినుద్దీన్ పై దాడికి పాల్పడారు. మాదాపూర్ వద్ద ఓవర్ టేక్ చేసి బస్సుకు అడ్డంగా కారు నిలిపి డ్రైవర్ పై యువకులు దాడి చేసి బస్సు అద్దాలు రాళ్లో ధ్వంసం చేశారు. దాడి సమయంలో అటుగా వెళ్తున్న బైకర్ కు రాయి తగిలి తీవ్రగాయాలు కావడంతో దాడి తర్వాత ఇద్దరు యువకులు, యువతి కారులో పరారయ్యారు. మాదాపూర్ పీఎస్ లో  బస్సు డ్రైవర్ మొయినుద్దీన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.