calender_icon.png 2 November, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వయం ఉపాధి దిశగా యువత ముందుకురావాలి..

01-11-2025 09:58:19 PM

జిల్లా కలెక్టర్ రాజర్షి షా..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి అవకాశాలను యువత పూర్తిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్‌ లోని టిటిడిసి భవనంలో నిర్వహించిన ఇందిరమ్మ సెంట్రింగ్ యూనిట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు కలెక్టర్ సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు.

శిక్షణ పొందిన యువత నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించుకుని స్వయం ఉపాధి సాధించాలని సూచించారు. నిర్మాణ రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికులను తీర్చిదిద్దడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. కష్టపడి నేర్చుకుంటే ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు తప్పక లభిస్తాయని, జిల్లాలో ఇలాంటి మరిన్ని శిక్షణా కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, డిఆర్డిఓ డిపిఎం, ఎపిఎం, న్యాక్ ఏడి స్వప్న రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.