4 May, 2026 | 3:17 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

ఆరు గ్యారెంటీలపై యువత నిలదీయాలి

07-10-2024 01:57 AM

మాజీమంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): గతేడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత.. ఒకసారి ఆలోచించాలని మాజీమంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆదివారం ఆయన ఎక్స్‌వేదికగా స్పందిస్తూ గ్యారెంటీలు అమలు చేయకపోగా, ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదని, రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు.

రైతు బంధును నిలిపేశారని, రైతు భరోసా జాడ లేకుండా పోయిందన్నారు. బోనస్‌ను బోగస్ చేశారని విరుచుకపడ్డారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తునా నాలుగు వేల నిరుద్యోగ భృతికి నీళ్లు వదిలారని పేర్కొన్నారు.

దసరాకు ఊళ్లకు వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్, బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాలను వివరించాలన్నారు. తమ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులకు ఆరు గ్యారెంటీలతో పాటు రైతు డిక్లరేషన్, యూత్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ డిక్లరేషన్‌లపై ఎక్కడిక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.