భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

07-05-2024 02:04:16 AM

నాగర్‌కర్నూల్, మే 6 (విజయక్రాంతి): తాగిన మైకంలో కట్టుకున్న భర్తపై ఓ ఇల్లాలు గొడ్డలితో దాడి చేసి హతమార్చింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మమ్మాయిపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ కనకయ్య గౌడ్ కథనం ప్రకారం.. మమ్మాయిపల్లికి చెందిన నక్క నాగయ్య(48), నక్క లక్ష్మి రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్ద రూ చాలాకాలంగా తాగుడుకు బానిసలయ్యారు. కాగా సోమవారం ఇద్దరూ ఇంట్లోనే పూటుగా తాగిన మైకంలో గొడవపడగా భార్య లక్ష్మిభర్తపై గొడ్డలితో దాడికి దిగింది. మూడు బలమైన గాయాలు కావడంతో రక్తపు మడుగులో ఉన్న నాగయ్యను గ్రామస్తులు గమనించి 108 సాయంతో జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం ్గమధ్యలో మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని సీఐ కనకయ్య తెలిపారు.