13-06-2025 12:04:46 AM
బడిబాట కార్యక్రమంలో కలెక్టర్
ఆదిలాబాద్, జూన్ 12 (విజయక్రాంతి) : ప్రభుత్వ బడుల్లో ఆన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతోందని, అందుచేతనే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా బేల మండలం దహేగాం, సాత్నా ల మండలం మాంగుర్ల గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లను అందజేశారు.
అనంతరం అంగన్వాడీ కేంద్రంను సందర్శిం చి, పిల్లల గ్రోత్ రిజిస్టర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లు, ఉచిత చదువు నాణ్యమైన విద్య అందుతొందన్నారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్, తహశీల్దార్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.