calender_icon.png 13 June, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతోనే మంచి భవిష్యత్తు

13-06-2025 12:04:46 AM

బడిబాట కార్యక్రమంలో కలెక్టర్

ఆదిలాబాద్, జూన్ 12 (విజయక్రాంతి) : ప్రభుత్వ బడుల్లో ఆన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతోందని, అందుచేతనే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా బేల మండలం దహేగాం,  సాత్నా ల మండలం మాంగుర్ల గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్‌లను అందజేశారు.

అనంతరం అంగన్వాడీ కేంద్రంను సందర్శిం చి, పిల్లల గ్రోత్ రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లు, ఉచిత చదువు నాణ్యమైన విద్య అందుతొందన్నారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్, తహశీల్దార్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.