13-06-2025 12:05:57 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి): నగరంలోని ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి స్లమ్లో సీసీ రోడ్డు వేయకుండానే రూ. 9 లక్షల బిల్లులు కాజేసిన అధికారులను సస్పెండ్ చేశారు. గురువారం జీహెఎంసీ కమిషనర్ ఆర్వీ నలుగురు అధికారులపై వేటు వేశారు. సింగరేణి స్లమ్లో సీసీ రోడ్డు పనులు చేయకుండానే ఎంఎస్ ఖాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ రూ.9 లక్షల బిల్లులను దాఖలు చేసింది.
ఈ బిల్లులను అధి కారులతో కుమ్మక్కు అక్రమంగా విడుదల చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఐఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేత జీహెఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో పాటు, జోనల్ ఆఫీసు వద్ద ధర్నా కూడా నిర్వహించారు. ఫిర్యాదు అందిన వెంటనే కమిషనర్ కర్ణన్ విచారణకు ఆదేశించారు.
విచారణలో పనులు జరగకుండానే బిల్లులు చెల్లించినట్లు, దీనికి క్వాలిటీ కంట్రోల్ రిపోర్టును సైతం ఫోర్జరీ చేసినట్లు తేలింది. వర్క్ ఇన్స్పెక్టర్, ఇన్చార్జి ఏఈగా ఉన్న అన్సారీని విధుల నుంచి తొలగించారు. అలాగే, డీఈతో పా టు ఇన్చార్జి ఈఈగా ఉన్న ఏకాంబరంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టు సంస్థ ఎంఎస్ ఖాన్ కన్స్ట్రక్షన్ నుంచి రూ.8.93 లక్షలను రికవరీ చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.