పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి
14-05-2024 01:17 PM
వికారాబాద్: పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి చెందిన దారుణ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకుంది. నాపరాతి పాలిష్ యూనిట్లో పనిచేస్తున్న దత్తు అనే వ్యక్తి ఐదు నెలల కొడుకు సాయినాథ్పై పెంపుడు కుక్క దాడి చేసి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి మృతిచెందాడు. గమనించిన బాలిడి తల్లిదండ్రులు కుక్కను కొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.




