calender_icon.png 27 June, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులకు ఘనంగా వీడ్కోలు

27-06-2025 01:05:02 AM

 రాజేంద్రనగర్, జూన్ 26: పదోన్నతి పై వెళ్లిన అధికారులకు ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ లో మేనేజర్ గా పని చేసిన మంజులత, రెవెన్యూ అధికారి నసీర్ కు పదోన్నతి రావడం తో బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు.

అదేవిధంగా బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ లో అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ రెడ్డికి ఘనంగా ఆహ్వానం తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక అధికారి పి. శ్రీధర్, తెలంగాణ మున్సిపల్ కమిషనర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ కృష్ణ మోహన్ రెడ్డి, బీజేఎంసీ కమీషనర్ బి. శరత్ చంద్ర, మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.