27-06-2025 01:02:22 AM
మేడ్చల్ అర్బన్, జూన్ 26: మేడ్చల్ మండల రెవెన్యూ పరిధి గిర్మాపూర్, రాయిలాపూర్, బండ మాదారం గ్రామాలలో క్వా రీల వల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్రా మస్తుల ఫిర్యాదు మేరకు గురువారం జిల్లా మైనింగ్ అధికారి సైదులు, కాలుష్య నియంత్రణ అధికారిని స్వప్న క్రషర్ మిషన్ల వద్ద ప రిస్థితిని తనిఖీ చేశారు.
క్వారీల ఇష్టారీతి బ్లాస్టింగ్ వల్ల గ్రామంలోని తమ ఇండ్లకు ప ర్రెలు వాసి కూలిపోయే దుస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు ఆరోపించారు. క్రషర్ మి షన్ల ద్వారా వస్తున్న దుమ్ముతో తాము రో గాల బారిన పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు ఫి ర్యాదులు చేసినా తనిఖీలు చేసి సదరు క్వారీలపై ఎలాంటి చర్యలు తీసుకోరని గ్రామ స్తుడు సత్యనారాయణమండిపడ్డారు.