ఐఐటీ హైదరాబాద్లో ఘనంగా హాఫ్ మారథాన్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ఐఐటీ హైదరాబాద్ రన్న ర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐఐటీ హైదరాబాద్ హాఫ్ మారథాన్ ఆదివారం నిర్వహించారు. ఈ హాఫ్ మారథాన్లో భాగంగా 21.1 కి.మీ, 10కె, 5కె రన్లను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కురాలు పూర్ణా మాలవత్, సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాలవత్ పూర్ణ దృఢనిశ్చయంతో కూడిన తన ప్రయాణాన్ని వివరించారు. సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ కలిగి ఉండటం అవసరం అని చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఈ మారథాన్తో విద్యార్థుల్లో స్నేహపూర్వక వాతావరణం పెరుగు తుందన్నారు. రన్నర్స్ క్లబ్ అధ్యక్షులు ప్రొ. ప్రేమ్ పాల్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉపేందర్ సుంకరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హిమాన్షు జోషి తదితరులు పాల్గొన్నారు.




