11-12-2025 12:00:00 AM
సనత్నగర్, డిసెంబర్ 10 (విజయక్రాంతి) :- సనత్ నగర్ శ్రీ చైతన్య రతన్ టాటా క్యాంపస్ ఎగ్జిక్యూటివ్ డీన్ మోహన్ రావు, డీన్ సతీష్ బాబు, సెంటర్ హెడ్ సంజయ్ సింగ్, ప్రిన్సిపల్ జ్యోతి, అకాడమిక్ ప్రిన్సిపల్ సతీష్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ కేశవ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులచే జాతీయ గీతాన్ని పాడి ఆటల ప్రారంభించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆట పోటీల్లో పాల్గొన్నారు.
కబడ్డీ, క్రికెట్, కోకో పలు రకాల ఆటలను నిర్వహించారు. విద్యార్థులు అన్ని ఆటలలో ఉత్తమ ప్రతిభను కనపరిచారు. గెలిచిన విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం షీలడ్స్ను మెమొంటోస్ను అందజేశారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది మాట్లాడుతూ బుధవారం శ్రీ చైతన్య కాలేజ్ అంటేనే భారతదేశంలో నెంబ ర్ వన్గా రాణిస్తుందని అందులో ఐఐటిలో టాప్ టెన్ ర్యాంకులన్నీ శ్రీ చైతన్య కాలేజీకి రావడం సంతోషదగ్గ విషయమని విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లో కూడా ఉత్త మ ప్రతిభను కనబరుస్తున్నారని విద్యార్థులకు వారి యొక్క తల్లిదం డ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్స్ సిబ్బంది పాల్గొన్నారు.