17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

26 ఏళ్ల విద్యా ప్రయాణానికి గుర్తింపు

08-11-2025 10:01 PM

డా. సొలోమన్ రెడ్డికి డాక్టరేట్..

మలేషియా మాస్ట్రో యూనివర్సిటీ గౌరవం.. సెయింట్ ఆంథోనీస్ పాఠశాల తరఫున ఘన సన్మానం..

సంగారెడ్డి (విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌లో గల సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థలో శనివారం గౌరవ డాక్టరేట్ సత్కార సభ ఘనంగా జరిగింది. సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థల అధినేత డా. ఈ. సొలోమన్ రెడ్డి విద్యారంగంలో చేసిన విశిష్ట సేవలను గుర్తించి మలేషియా మాస్ట్రో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది. కార్యక్రమాన్ని డా. సొలోమన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈ. అరుణ రెడ్డి, అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఈ. జయబాల రెడ్డి, డైరెక్టర్ ఈ. విజయ కుమార్ రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఈ. జ్యోతి రెడ్డి, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జోహార్, వైస్ ప్రిన్సిపల్ ప్రదీప్ లక్కిశెట్టి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

తరువాత విద్యార్థులు స్వాగత నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమాన్ని అలరించారు. 26 సంవత్సరాలుగా విద్యా అభివృద్ధికి కృషి చేస్తూ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దినందుకు గాను డాక్టర్ సొలోమన్ రెడ్డిని మాస్ట్రో యూనివర్సిటీ గౌరవించింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, సేవాభావం గల సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ఘనంగా సన్మానించారు. పాఠశాల తరఫున ఆయనకు శాలువా, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.