1 July, 2026 | 9:10 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

నేల కూలిన వందల ఏళ్ల వట వృక్షం

03-05-2025 01:29 AM

మహబూబాబాద్, మే 2 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో గురువారం రాత్రి వీచిన పెను గాలులకు బయ్యారం మండల కేంద్రంలోని ముత్యాలమ్మ మర్రిగా గుర్తింపు పొందిన 200 సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రి చెట్టు కూకటి వేళ్ళతో నేల కూలింది.

దేవాలయం పక్కనే ఉన్న మరి చెట్టు అనేక సంవత్సరాలుగా ప్రజలకు నీడనివ్వడంతో పాటు పిల్లలు ఆడుకోవడాని అణువుగా ఉండేది. ప్రజలతో ఎంతో విడదీయరాని అనుబంధం ఉన్న మర్రి వృక్షం సమూలంగా పడిపోవడంతో బయ్యారం ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.