17 June, 2026 | 11:05 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

మోకాళ్ళపై కూర్చోని నిరసన

04-12-2024 08:16 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మద్యాహ్న భోజనం అందిస్తున్న వంట కార్మికులకు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించి గౌరవ వేతనం ప్రతి నెల చెలించాలని కోరుతూ బుధవారం నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందు మద్యాహ్నం భోజన కార్మికులు మోకాళ్లపై కూర్చోని నిరసన తెలిపారు. ప్రభుత్వ వైకరిని నిరసిస్తు నినాదాలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న అధికారులు తమకు మాత్రం ప్రతి నెల బిల్లులు మాత్రం ఇవ్వకపోవడంపై వారు మండిపడ్డారు. 11 నెలల కోడి గుడ్ల బిల్లులు రావడం లేదన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, ఉమా, ప్రమీల, లక్ష్మీ తదితరులు ఉన్నారు.