25-06-2025 07:32:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు ఏ శ్రీనివాస్ కు అరుదైన గౌరవం దక్కింది. డాక్టర్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా విభాగంలో 250కి పైగా ఆన్లైన్ కోర్సులు చేసినందుకు గాను అవార్డులు పొందారు. విద్యలో ఉత్తమ బోధనా గాను, విద్యారంగంలో చేసిన కృషికి గాను వరల్డ్ చారిటీ అవార్డు(World Charity Award) ఆర్గనైజేషన్, అమెరికన్ మెరిట్ కౌన్సిల్ వారు సంయుక్తంగా నిర్వహించిన ప్రోగ్రాంలో డాక్టరేట్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డును కమ్యూనిటీ హాల్ ఏఎస్ నగర్ ECILలో ప్రోగ్రాం బుధవారం హైదరాబాదులో అందుకున్నారు. ఈయన నిర్మల్ పట్టణంలోని వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు.