15 April, 2026 | 12:07 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

ప్రశ్నించే గొంతుతో బలమైన సమాజం

30-12-2025 12:03 AM

గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ 

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): సమాజంలో ప్రశ్నించే గొంతు తయారైనప్పుడు బలమైన సమాజం నిర్మితమవుతుందని, ఆ దిశగానే గోషామహల్  నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి బస్తీ నిద్ర వేదికగా నిలుస్తుందని గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం ఉస్మాన్ సాయిలోని శ్రీ జంగల్ విఠో బా దేవాలయంలో, విఠలేశ్వర రుక్మాబాయిలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్తీ నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అక్కడే ఏర్పాటుచేసిన బస్తీ నిద్ర కుటిర కేంద్రాన్ని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బస్తీ నిద్ర ద్వారా బస్తీలలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన మౌలిక వసతులు, నిరుపేద విద్యార్థులకు అందించాల్సిన క్రియేటివ్ ఎడ్యుకేషన్, ప్రజా ఆరోగ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం భద్రత, రాజకీయ నవీకరణ తదితర అంశాలపై అవగాహనతో పాటు పరి ష్కారం కోసం కృషి చేస్తామన్నారు.

తమ వలంటర్లు బస్తీలోకి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, పరి ష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ఏడాది పొడవునా కొనసాగుతుందన్నారు. త్వరలో గడ్డం పొలిటికల్ అకా డమీని ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ అకాడమీ ద్వారా యువతకు విలువలు, సిద్ధాంతాలు, నీతివంతమైన రాజకీయం అం శాలపైన తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

గోషామాయిల్ ఎమ్మెల్యే రాజాసింగ్, బేగంబజార్ కార్పొరేటర్ జి శంకర్ యాదవ్ అవినీతిలో కూరుకుపోయారని, వేల కోట్ల లో ఆస్తులు సంపాదించారని, త్వ రలో వీరి భరతం పట్టేందుకు తాము క్యారాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఇలాంటి రాజకీయ నాయకులను గద్దె దింపడమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమ న్నారు. విఠోబా దేవాల యం అధ్యక్షుడు వి కిషన్ యాదవ్, ఎం మాణిక్ రావు, లక్ష్మణ్, శ్రీనివాస్ యా దవ్, క్రాంతి, ఏం నిర్మల్ కుమార్ యాదవ్, వినోద్, సరస్వతి, హారిక, లతా, పాల్గొన్నారు.