02-06-2025 01:43:45 AM
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు
కరీంనగర్ క్రైం, జూన్ 1 (విజయ క్రాంతి): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోయి లేకుండా మాట్లాడుతున్నారని బిఆర్ఎస్ జివి రామకృష్ణారావు దుయ్యబట్టారు. ఆదివారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడుతూ కరీంనగర్ ఎంపిగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి ఢిల్లీలో చక్కదిద్దకుండా కరీంనగర్ గల్లీ లీడర్గా వ్యహరిస్తున్నారని అస్తమానం కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
కుటుంబ పార్టీ బిఆర్ఎస్ పొత్తు ప్రసక్తే లేదంటున్న ఆయన ఎన్డీఏలో 23 కూటమిలున్నాయని తెలియదా? అని ప్రశ్నించారు. అందులో టిడిపి కుటుంబ పార్టీతో సహా జనసేన, మహారాష్ట్రలో అజల్ పవార్, శివసేన, కర్ణాటకలో జేడీఎస్, జమ్మూకాశ్మరీల్ షేక్ అబ్దుల్లా, సర్కార్, తమిళనాడు, బీహార్లోనూ కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. దేశంలో టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని పేర్కొన్నారు.
పార్టీ స్థాపించినప్పుడు వారసత్వ రాజకీయాలు లేవని, వారంతా పునాది రాళ్లలాగా పనిచేశారని పేర్కొన్నారు. కేవలం పార్టీలో భాగస్వాములు మాత్రమేనని, క్షేత్రస్థాయిలో ప్రజల ఆశీర్వాదంతో ఎదిగి ప్రజాప్రతినిధులయ్యారన్నారు. అవినీతికి పాల్పడ్డారంటున్న బండి సంజయ్ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్క ఎఫ్ఐ ఆర్ అయినా నమోదైందా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం దెబ్బతినేలా చేస్తున్న బండి సంజయ్ నంబర్ వన్ క్రిమినల్ అని అన్నారు . రాష్ట్రం బాగు కోసం బిఆర్ఎస్ పనిచేస్తే రాష్ట్రాన్ని నాశనం కోసం బండి సంజయ్ కుయుక్తులు పన్నుతున్నారన్నారు. బిజెపి అగ్రనేతలు అమిత్ షా పై మూడు కేసులు, మోడీపై వందల కేసులు లేవా అని ప్రశ్నించారు.
అనేకమైన సిబిఐ కేసులున్న వారిని జేబులో పెట్టుకున్న నరేంద్ర మోడీ దొంగల ముఠాను మోస్తున్నారని, అందులో బండి ఒక సభ్యుడని పేర్కొన్నారు. రాష్ట్రంలో పడిపోయే నావ లాంటి బిజెపిలో తాము కలవబోమని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి, ప్రధాని మోడీని ఇష్టారీతిన దుయ్యబట్టినా వారం రోజుల నుంచి బండి సంజయ్ కనీసం ఖండించలేదన్నారు. ప్రశ్నించారు.
ఆరు గ్యారెంటీ విషయంలో దైవాలాతీసామని ముఖ్యమంత్రి చెబుతుంటే ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు అవసరమైన నిధులివ్వాలన్న సోయి లేకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కెసిఆర్ కుటుంబంపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, భాస్కర్, రవి, సంపత్, శేఖర్, చారి, తదితరులున్నారు.