02-06-2025 01:45:29 AM
కరీంనగర్, జూన్ 1 (విజయ క్రాంతి): నగరంలోని కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో ప్రపంచ పాల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు సూచన మేరకు అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్, వేసవి క్రీడా శిక్షణ పొందుతునన వి ద్యార్థులకు ఉచితంగా వేడి పాలు, బిస్కెట్స్, బటర్ మిల్క్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పి శంకర్, మార్కెటింగ్ మేనేజర్ టి రాజశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ పాలతోనే మన జీవితం ప్రారంభమవుతుందని, పాలే మనిషికి అమృతతుల్యమని అన్నారు.
కరీంనగర్ డెయిరీ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా విరాజిల్లుతూ పాలు సేకరించి 24 గంటల్లోనే వినియోగదారులకు అందించే ఏకైక డెయిరీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది, వాకర్స్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.