18-01-2026 03:58:08 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రజా స్వామిక పాలన ప్రజల్లో మార్పు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుందని జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ అన్నారు. ఆదివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నా నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఆదరించే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వినోద్ సాదిక్ హైదర్ తదితరులు పాల్గొన్నారు.