‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ
19-03-2026 11:36 AM
హైదరాబాద్: 'తెలంగాణ ప్రజా జాగృతి'(Telangana Praja Jagruti) పేరిట కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేసి గుర్తు కేటాయించాలని కవిత ఈసీకి దరఖాస్తు చేశారు. తన పార్టీ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని డిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ వేశారు. కవిత దరఖాస్తులో లోపాలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కవిత పిటిషన్ పై ఇవాళ మరోసారి ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త పార్టీ నమోదు కోసం కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి జనవరి 23న దరఖాస్తు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. అటు కవిత తెలంగాణ ప్రజలకు 'శ్రీ పరాభవ' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.




