17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు

26-04-2025 09:05 AM

హైదరాబాద్: కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు(ACB officials) సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ షేక్ పేటలోని ఆదిత్య టవర్స్ లోని హరిరామ్ నివాసంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హరిరామ్  కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా పనిచేస్తున్న హరిరామ్ ఇంట్లో సోదాలు. కాళేశ్వరం(Kaleshwaram Project) అనుమతులు, రుణాల్లో హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే కీలక పత్రాలు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హరిరామ్ భార్య అనిత కూడా నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్ సీగా విధులు నిర్వహిస్తున్నారు. అనిత ప్రస్తుతం వాలంతరి డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో ఉన్నారు. కాళేశ్వరంపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికతో హరిరామ్ నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.