10 May, 2026 | 11:07 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

విద్యుత్ అధికారి ఇంటిపై ఏసీబీ సోదాలు

25-04-2024 01:22 AM

మేడ్చల్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : సస్పెండ్‌లో ఉన్న విద్యుత్ శాఖ అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహిం చగా విలువైన ఆస్తుల పత్రాలు లభించినట్లు వెళ్లడించారు. అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్ కీసరాలో ఏఈగా విధులు నిర్వహిస్తుండేవారు. అయితే 2023 ఫిబ్రవరిలో రూ.12వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలో సస్పెండ్‌లో ఉన్న అనిల్ కుమార్ ఇంట్లో  బుధవారం సోదాలు నిర్వహించగా రూ. 34లక్షల నగదు, 20 తులాల బంగారం, కోటి రూపాయల విలువైన స్థిరాస్తుల పత్రాలు లభించినట్లు అధికారులు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు తెలుస్తుందని, బంధువుల ఇండ్లలోనూ సోదాలు జరిపే అవకాశం ఉందన్నారు.