calender_icon.png 23 December, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు

23-12-2025 11:07:00 AM

డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్: మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్(Mahabubnagar Deputy Transport Commissioner)పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై ఏసీబీ సోదాలు(Anti-Corruption Bureau) చేస్తోంది. డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ కిషన్ నాయక్ నివాసాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి లోని నివాసాల్లో సోదాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉన్నాయి.