ప్రణయ్ హత్య కేసులో ఏ1 నిందితుడు బెయిల్పై విడుదల
09-01-2026 01:07 AM
కుషాయిగూడ, జనవరి 8 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న మారుతి రావు స్వయాన సోదరు డైన శ్రావణ్ కుమార్ కు హైకోర్టు బెల్ మంజూరు చేయడంతో చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి విడుదలైనాడు హైకోర్టులో శ్రావణ్ కుటుంబ సభ్యులు బెల్ వేయగా ఎట్టకేలకు బేల్ మంజూరు చేయడంతో శ్రావణ్ కుమార్ గుట్టు చప్పుడు కాకుండా చర్లపల్లి నుంచి విడుదలైనాడు ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే చర్లపల్లి జైలు అధికారులను వివరణ కోరగా శ్రావణ్ బెయిల్ పై విడుదలయ్యాడని మీడియాకు తెలిపారు.




