18 March, 2026 | 2:50 AM

ట్రైబల్ వర్సిటీకి 211ఎకరాలు

02-11-2024 12:57 AM

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): సమ్మక్క, సారక్క సెంట్రల్  ట్రైబల్ యూనివర్సిటీకి ప్రభుత్వం ములుగులో 211.26 ఎకరాలను కేటాయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భూమి విలువ దాదాపు రూ.10.58 కోట్లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల ట్రైబల్ యూనివర్సిటీకి  211ఎకరాలను కేటాయిస్తూ.. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.