14-06-2025 10:37:12 PM
కమిషనర్ హెచ్చరిక..
కరీంనగర్ (విజయక్రాంతి): డివిజన్ల పునర్విభజన ప్రక్రియను నియమ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని... నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తీస్కుంటామని నగరపాలక సంస్థ కమీషనర్ ప్రపూల్ దేశాయ్(Commissioner Praful Desai) అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో భాగంగా శనివారం రోజు టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు సిబ్బందితో కలిసి ఫీల్డ్ లెవల్ లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. నగరంలోని జ్యోతినగర్, చైతణ్యపురి, భాగ్యనగర్, కిసాన్ నగర్, అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి.... క్షేత్ర స్థాయిలో ఫిర్యాదులను తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో డీ లిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి డివిజన్ల వారిగా వచ్చిన ఫిర్యాదులన్నిటీని పరిశీలించి... అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. వివిధ అంశాల వారిగా వచ్చిన ఫిర్యాధుల పై సలహాలు, సూచనలు చేస్తూ.... అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియను పురపాలక శాఖ నిబంధనల ప్రకారం ఫీల్డ్ లెవల్ లో పరిశీలించి... జన్యున్ గా ఉన్న ఫిర్యాదులను పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు సిబ్బంది సమన్వయంతో ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం డివిజన్ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.
ఎవరు నిబంధనలు అతిక్రమించిన వారి పై చర్యలు తప్పవన్నారు. బిల్ కలెక్టర్లు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ల లలో హౌజ్ నెంబర్లు తప్పిపోకుండ సరైన వివరాలను అందించాలని అన్నారు. హౌజ్ నెంబర్లలో తప్పిదాలు జరిగితే సంబంధిత బిల్ కలెక్టర్లు, ఆర్ ఐ ల పై చర్యలు తప్పవన్నారు. ఏ కమ్యూనిటి ప్రజలకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా డివిజన్ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇచార్జ్ డీసిపి బషిరోద్దిన్, ఏసిపిలు శ్రీధర్, వేణు, టిపిఎస్ లు రాజ్ కుమార్, తెజస్విని, సంధ్య, ఆర్వో భూమానందం, ఆర్ ఐ లు విజయలక్ష్మి, కిష్టయ్య, హిదాయతుల్లా, సూపరింటెండెంట్ సంజీవ్, టీపివోలు సాయి చరణ్, ఖాధర్, నధియా, సాయి కిరణ్, నవీన్,తదితరులు పాల్గొన్నారు.