26-08-2025 08:42:44 PM
గద్వాల: జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా శెట్టి ఆత్మకూరు లో ఏర్పాటు చేయబడిన ఏటీసీ లో 100 శాతం ప్రవేశాలు పూర్తి అయ్యాయని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు తెలిపారు. మంగళవారం తన ఛాంబర్ లో ఈ సందర్బంగా టి గేట్ సభ్యుల పని తీరును అభినదించారు. రిజిస్ట్రేషన్ చేసుకుని సీట్లు లభ్యం కాని విద్యార్థులకు ఏదో ఒక ఉపాధి మార్గం చూపించాలి అని సూచించారు. ఈ సమావేశం లో టి గేట్ చైర్మన్ పి. జె. మహేష్ కుమార్, సభ్యులు, అభ్యర్థులు పాల్గొన్నారు.