26-08-2025 10:29:03 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని శేట్లూర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజన పథకంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థులను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తార పరామర్శించారు. బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శెట్లుర్ గ్రామ విద్యార్థులు మధ్యాహ్నం ఆహార పథకంలో అస్వస్థకు గురి అయినా విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే అరుణా తార వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని డాక్టర్ తో మాట్లాడారు.