26 March, 2026 | 1:55 PM

Breaking News

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి   •   అంజన్న హుండీ లెక్కింపు ప్రారంభం   •   బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •  

ఏసీబీ వలలో ఏఈఈ

30-10-2024 01:29 AM

50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

రాజేంద్రనగర్, అక్టోబర్ 29: రూ.50 వేలు లంచం తీసుకుంటున్న జీహెచ్‌ఎంసీ ఏఈఈని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. ఏఈఈ వెంకోబా గతంలో రాజేంద్రనగర్ సర్కిల్‌లో పనిచేశారు. నెల రోజుల క్రితం ఆయన గోషామహల్‌కు బదిలీ అయ్యారు. గతంలో రాజేంద్రనగర్‌లో పనిచేస్తుండగా కాంట్రాక్టులకు సంబం ధించి ఎం బుక్‌లో కొలతలు నమోదు చేసేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేశా రు. ఈ విషయమై బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు.

ప్రణాళిక ప్రకారం సద రు కాంట్రాక్టర్ మంగళవారం సాయంత్రం అబిడ్స్‌లోని ఓ హోటల్‌లో రూ. 50 వేలు ఇస్తుండగా కాపుకాసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈఈ వెంకోబాకు కెమికల్ పరీక్ష నిర్వహించగా లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు అధికారులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.