సండ్ర వెంకటవీరయ్య వ్యాఖ్యలను ఖండించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
08-04-2026 12:00 AM
వేంసూరు. ఏప్రిల్ 7 (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేసిన వ్యాఖ్యలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు తీవ్రంగా ఖండించారు. మంగళవారం భరణిపాడు లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గెలిచిన దగ్గర నుంచి ఈరోజు వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని, ఆ పనులను చూసి ఒరవలేక అవ్వకు చవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. నిధులు, రైతు భరోసా, రైతు భీమా, సన్న ధాన్యం బోనస్, రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు వాటి లెక్కలతో సాహా ప్రెస్ మీట్ లో తెలియపరిచారు. మాజీ ఎమ్మెల్యే అసత్యాలు మానుకోవాలని హితవు పలికారు.




