17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సంక్రాంతి నుంచి వ్యవసాయ యాంత్రీకరణ

04-01-2026 12:52 AM
  1. వ్యవసాయానికి రూ.లక్ష కోట్లు ఖర్చు 

అసెంబ్లీలో మంత్రి తుమ్మల వెల్లడి 

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): సం క్రాంతి పండుగ నుంచి వ్యవసాయ యాంత్రీకరణ ప్రారంభమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే వ్యవసాయ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేశారని మంత్రి పేర్కొన్నారు.  రైతు బంధు, రైతు రుణమాఫీతో పా టు వ్యవసాయ అనుబంధ పనులకు దాదాపు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సోయా, మక్కలను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముం దుకు రాకపోతే ..రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని మంత్రి వివరించారు.