15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ

06-01-2026 02:13 PM

హైదరాబాద్: వరంగల్ కోట భూముల ఆక్రమణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) లేఖ రాశారు. వరంగల్ కోట భూములను(Warangal Fort lands) పురావస్తుశాఖవిగా గుర్తించాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కోట పరిసరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. ఆక్రమణదారులపై పురావస్తుశాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కోట భూములను ఏఎస్ఐ భూములుగా రికార్డుల్లో సవరించాలన్నారు. వరంగల్ కోట చుట్టూ 7 ప్రాకారాల్లో 3 మాత్రమే మిగిలాయని, మిగిలిన ప్రాకారాల భూముల్లో అక్రమ నిర్మాణాలున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఆక్రమణలపై ఏఎస్ఐ అధికారులు(ASI officials) నోటీసులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కోట చుట్టూ ఉన్న మట్టి గోడ, రాతి గోడలను ధ్వంసం చేస్తూ ఆక్రమిస్తున్నారని సూచించారు. చారిత్రక సంపదను కాపాడటంలో ప్రభుత్వం చొరవ చూపాలని లేఖలో పేర్కొన్నారు. వరంగల్ కోట పరిరక్షణకు ఏఎస్ఐ కి  ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు.