calender_icon.png 6 June, 2025 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐ నిపుణులు కావలెను!

05-06-2025 01:20:03 AM

  1. 2026 నాటికి భారత్‌లో పదిలక్షల మందికి డిమాండ్
  2. ఏఐ కోర్సు ఎంపికలో 16 శాతం పెరుగుదల

హైదరాబాద్, జూన్ ౪ (విజయక్రాంతి): భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (ఏఐ) ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతున్నది. ఏఐ నిపుణుల డిమాండ్ కూడా గణనీయంగా వృద్ధి కనబరుస్తున్నది. లక్షలాది మంది నైపుణ్యమున్న మానవవనరులు అందుబాటులో ఉండటంతో ప్రపంచ దేశాలు భారతదేశం వైపు దృష్టి సారిస్తున్నాయి.

2026 నాటికి భారత్‌లో పది లక్షల మంది నైపుణ్యమున్న ఏఐ నిపుణులకు డిమాండ్ ఉన్న ట్టు తాజాగా ‘ఇండియాస్ రెవల్యూషన్: రోడ్ మ్యాప్ టూ వికసిత్ భారత్’ నివేదిక వెల్లడించింది.

2047 కల్లా 23-35 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టు కున్న నేపథ్యంలో ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యలో ఏఐ, ఆటోమేషన్ వంటి కోర్సుల ద్వారా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఆ దిశగా విద్యార్థులకు శిక్షణను అందుబాటులోకి తీసు కొస్తున్నాయి. 

16శాతం పెరుగుదల..

ఐటీ రంగంలో ఇంజినీరింగ్ విద్య కీలకంగా మారింది. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) ప్రకారం 2024-25 సంవత్సరంలో 14.9 లక్షల ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి లభించింది. అయితే గత నాలు గేళ్లతో పోలిస్తే ఇంజినీరింగ్ సీట్ల అనుమతి ప్రక్రియలో 16 శాతం పెరుగుదల కనిపించినట్టు నివేదిక స్పష్టం చేస్తున్నది.

ఈ వృద్ధిలో 50శాతం వరకు ఐటీ రంగం లో భారీగా డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ వంటి కోర్సులపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నది. ప్రపంచ ఆవిష్కరణలతో ముందుకుసాగడంతోపాటు బాధ్యతాయుతమైన ఆవిష్కర్తలుగా విద్యార్థులను తీర్చిదిద్ద డంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకపా త్ర పోషిస్తున్నదని వెల్లడించింది. 

2సాంకేతిక విద్యే పునాది..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎక్స్‌టెండెడ్ రియాల్టీ, ఎథికల్ ఏఐ, డేటా విజువలైజేషన్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటివి సాంకేతిక విద్యకు పునాదులుగా మారుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటర్న్‌షిప్ వంటి పరిశోధనాత్మక శిక్షణ యువతకు అందుబాటులోకి వస్తుందని నివేదిక తెలిపింది.

ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత పర్యావ రణ వ్యవస్థను యువతకు అందించాల్సిన అవసరం ఉంది. ఇందులోభాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం యువతలో నైపుణ్యాభివృద్ధి దిశగా ఎంతో చిత్తశుద్ధి చూపుతున్నది.

ఇప్పటికే స్కిల్స్ యూనివర్సిటీ వంటి అద్భుతమైన అవకాశాన్ని తెలం గాణ యువతకు అందించింది. నైపుణ్యము న్న మానవ వనరులను తీర్చిదిద్ది అంతర్జాతీయ ఐటీ రంగాన్ని ఆకర్షిస్తున్నది. తద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నది. 

టాప్-5లో భారత్

45 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌తో 2025 సంవత్స రానికి భారతదేశ ఏఐ పరిశ్రమ 28.8 బిలియన్ డాలర్లకు చేరు కుంటుందని ఇండియా స్కిల్స్ రిపోర్ట్-2024 అంచనా వేసింది. దీంతోపాటు 2016 నుంచి 2023 వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యమున్న శ్రామికశక్తి 14శాతం పెరిగిందని స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే భారత్ అత్యంత వేగం గా ఏఐ వృద్ధి చెందుతున్న టాప్ 5 దేశాల్లో ఒకటిగా నిలిచింది. జాబితాలో సింగపూర్, ఫిన్‌లాండ్, ఐర్లాండ్, కెనడా దేశాలు భారత్ ముందున్నాయి. ఏఐ నిపుణులకు డిమాండ్ పెరగడానికి కారణం వేగవంతమైన సాంకేతిక పురోగతి అని నివేదిక స్పష్టం చేసింది.