05-06-2025 01:18:56 AM
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం, జూన్ 4 ( విజయ క్రాంతి)తాను స్వతాగా కుట్టు శిక్షణలో నేర్చుకున్నది పదిమందికి తెలియజేసి వారు కూడా కుట్టు శిక్షణ తీసుకొని తాను జీవనోపాధి పెంపొందించుకోవడమే కాక పదిమందికి ఉపాధి కల్పించినట్లు అవుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.బుధవారం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో గిరిజన మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకున్న తర్వాత జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ నెలరోజులపాటు శిక్షకులు అందిస్తున్న కుట్టు శిక్షణను శ్రద్ధతో మెలకువలు తెలుసుకొని వివిధ రకాల డిజైన్లను ఏ విధంగా రూపొందించాలో అడిగి తెలుసుకోవాలన్నారు.
పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకున్న తర్వాత ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా మీ గ్రామంలో కుట్టు మిషన్ షాపులు పెట్టుకొవాలన్నారు. మీ గ్రామంలోని చుట్టుపక్కల హ్యాబిటేషన్లో అందరితో పరిచయాలు ఏర్పరచుకొని ఎటువంటి రకాలు బట్టలు కుట్టించుకోవాలన్న మీ వద్దకే జనాలు వచ్చేలా చూడాలని అన్నారు.
శిక్షకులు బ్లౌజ్, స్కర్ట్ ,యూనిఫామ్, పంజాబీ డ్రెస్, షర్ట్ ,నిక్కర్, ఫ్రాగ్ చుడీదారులు కుట్టడంలో బాగా పరిణితి చెందాలని, రాబోయే రోజుల్లో ఎంబ్రాయిడరింగ్ కూడ శిక్షణ అందిస్తామని, ప్రస్తుతం శిక్షణ తీసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని, అవసరం ఉన్న మహిళలకు బ్యాంకు వారిని సంప్రదించి ముద్ర లోన్ ద్వారా తక్కువ వడ్డీతో కుట్టు మిషన్లు ఇప్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, జేడియం హరికృష్ణ, కుట్టు శిక్షణా శిక్షకురాలు వైదేహి మరియు గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.