26 June, 2026 | 6:43 PM

Breaking News

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •  

ఘనంగా ప్రారంభమైన అలయ్ బలయ్

03-10-2025 11:35 AM

హైదరాబాద్: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatraya) ఆధ్యర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా దత్తాత్రేయ దసరా మర్నాడు ఆలయ్ బలయ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అలయ్ బలయ్ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, మంత్రులు, వివిధ పార్టీల నేతలు  హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లు చాటిచెప్పేలా అలయ్ బలయ్ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం దత్తన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.