5 May, 2026 | 7:05 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

భారీ వర్షాలతో అప్రమత్తం

08-08-2025 01:12 AM

- జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి 

- ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వ ర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాల ని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో ప్రజ లు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సీఎం సూచించారు.

సీఎస్, డీజీపీ, జీహెచ్‌ఎంసీ, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులతో ఢిల్లీ నుంచి రేవంత్‌రెడ్డి గురువారం ఫోన్ చేసి మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.