04-06-2025 12:56:20 AM
జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ తో ఎమ్మెల్యే జిఎంఆర్
సంగారెడ్డి, జూన్ 3(విజయక్రాంతి): బల్దియా పరిధిలోని భారతి నగర్, పటాన్చెరు, రామచంద్రపురం డివిజన్ల పరిధిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించాలని, నూతన పారిశుద్ధ్య వాహనాలు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు సహకారం అందించాలని శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. మంగళవారం శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ హేమంత్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం అయ్యారు.
స్పందించిన జోనల్ కమిషనర్ హేమంత్.. అతి త్వరలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సురేష్, ఎస్ఈ శంకర్ నాయక్, డిఈ నరేందర్, దేవేందర్, ఏఈ శివ పాల్గొన్నారు.