04-06-2025 12:54:41 AM
- తేడా తెలియని స్థితిలో టీపీసీసీ చీఫ్
- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): పాకిస్థాన్ ఆర్మీకి, మావోయిస్టులకు తేడా తెలియని స్థితిలో టీపీసీసీ ప్రెసిడెంట్ మహే శ్కుమార్ గౌడ్ ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఎద్దేవా చేశారు. పీసీసీ చీఫ్ చేసిన అజ్ఞాన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు.
మావోయిస్టులను పాకిస్థాన్ ఆర్మీతో పోల్చడం బాధ్యతా రాహిత్యమని, జాతీయ భద్రత, దౌత్యపరమైన విషయాలపై కాంగ్రెస్ పార్టీకి అవగా హన లేనట్టు ఈ వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అజ్ఞానాన్ని సంస్థాగతంగా మార్చేసిందని విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలను నిరాకరిస్తూనే.. పాకిస్థాన్తో డీజీఎంవో స్థాయి చర్చలు జరుపుతోందన్న టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలు చూస్తే ఆయనకున్న అవగాహన ఎంతో అర్థమవుతుందని సుభాష్ పేర్కొన్నారు.
ఇది అసంబద్ధమైన పోలికని.. పాకిస్థాన్ ఒక గుర్తింపు పొందిన దేశమని.. అయినా దాని విధానాలు సరైనవి కాదన్నారు. మావోయిస్టులు దేశంలో హింసా త్మక చర్యలతో దేశ వ్యతిరేక విధానంతో ఉన్నవారని.. ఈ రెండు అంశాలను పోల్చడం కాంగ్రెస్ జాతీయ భద్రత, దౌత్యపరమైన అవగాహన లేమిని ప్రస్ఫుటిస్తోం దన్నారు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు శాంతిచర్చలు విఫలమయ్యాక జరిగిన హింసాత్మక ఘటనను సుభాష్ గుర్తుచేశారు.