26-05-2025 12:44:33 AM
చిన్న చింతకుంట, మే 25: మండల కేం ద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి 1999- 2000బ్యాచ్ కి చెంది న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.
పూర్వ విద్యార్థు లు 25 సంవత్సరాల తర్వాత కలుసుకొని సి ల్వర్ జూబ్లీని తమ పూర్వ ఉపాధ్యాయులను స్మరించుకుని అలనాటి బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు జగదీష్, దశరథం,మార్కెండయులు, ఉపాధ్యాయలను ఘనంగా సన్మానించారు.
అనంతరం వారి జ్ఞాపకాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పంచుకున్నారు. విద్యార్థిని, విద్యార్థులు వా రు చదువుకున్న రోజుల్లో కొన్ని సంఘటనలను గర్తు చేసుకొని సాయంత్రం వరకు సం తోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూ ర్వ విద్యార్థులు వాకిటి మధు, ఎస్ నాగేందర్, జీ మన్యం తదితరులు పాల్గొన్నారు.