09-06-2025 01:13:47 AM
ముషీరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి) : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యునైటెడ్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం దోమలగూడ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యునైటెడ్ అసోసియే షన్ నూతన అధ్యక్షుడిగా సాదుల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా శతరాజు మురళి, జనరల్ సెక్రటరీగా సత్తు వెంకన్న, జాయింట్ సెక్రటరీగా మేడబోయిన నరసింహ,
ట్రెజరర్గా తలుపునూరి అశోక్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా మేదరి రాజేందర్, వడ్లకొండ నగేష్, రాష్ట్ర సలహా దారులు తేలుకంటి మురళి, స్టేట్ కో-కన్వీనర్ కాళ్ళ ప్రభాకర్లు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. అనంతరం కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అధ్యక్షడి చేతులమీదుగా అందజేశారు.