calender_icon.png 19 May, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

18-05-2025 08:49:09 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): పూర్వ విద్యార్థులు సామాజిక సేవలో భాగస్వాములు కావాలని రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తోట హనుమండ్లు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం ధర్మారావుపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-2004 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఈ సందర్భంగా సన్మానించారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు విజయరామరాజు, ఈశ్వర్, అంకం రాజు, రమేష్ రెడ్డి, జమీల్, రాజ్యలక్ష్మి, సమీనా తదితరులు పాల్గొన్నారు.