11-05-2025 06:45:53 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలకు చెందిన 2006- 2007 పదో తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2006- 2007లో చదువు చెప్పిన ఉపాధ్యాయులు రావడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని వారు చిన్నప్పటి చేసిన కోతి శ్రేష్టలు, తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.