26-10-2024 12:00:00 AM
ఇస్తాంబుల్: తుర్కియే వేదికగా జరుగుతున్న డబ్ల్యూ 35 కాయ్సెరీ టెన్నిస్ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్ అంకిత రైనా డబుల్స్ విభాగం లో సెమీస్కు దూసుకెళ్లింది. మహిళల డబుల్స్లో శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో అంకిత-జకుపొవిక్ (స్లొవేనియా) జంట 6-3, 6-3తో బొజికా-వొనారు (రొమేనియా) ద్వయంపై విజయం సాధించింది. నేడు జరగనున్న డబుల్స్ సెమీస్లో ఈ జోడీ కొలొడిన్స్కా- కుజ్మోవాను ఎదుర్కోనుంది. డబుల్స్లో సెమీస్ చేరిన అంకిత సింగిల్స్లో మాత్రం క్వార్టర్స్కే పరిమితమైంది.