20 June, 2026 | 3:37 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

ఫైనల్ రేసులో భారత్

26-10-2024 12:00 AM

కివీస్‌తో హాకీ మ్యాచ్ డ్రా

జొహొర్ బహ్రూ: మలేషియా వేదికగా జరుగుతున్న సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్ హాకీ టోర్నీలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను భారత్ 3-3తో డ్రా చేసుకుంది. భారత్ తరఫున గుర్జోత్ సింగ్ (ఆట 6వ నిమిషంలో), రోహిత్ (17వ ని.లో), తలేమ్ (60వ ని.లో) గోల్స్ సాధించగా.. న్యూజిలాండ్ తరఫున జాంటీ ఎల్మ్స్ (7, 32, 45వ ని.లో) హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు.

ప్రస్తుతం 10 పాయింట్లతో భారత్ పట్టికలో టాప్‌లో కొనసా గుతున్నప్పటికీ ఆస్ట్రేలియా, బ్రిటన్ మ్యాచ్ లు ముగిసిన తర్వాతే ఫైనల్ ఎవరు ఆడతారనేది స్పష్టత రానుంది. బ్రిటన్‌తో జపాన్, ఆస్ట్రేలియాతో మలేషియా తలపడనున్నా యి. చివరి క్వార్టర్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఇరుజట్లు కొదమ సింహాల్లా పోరాడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.