15-06-2025 12:00:00 AM
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రెండు రోజులుగా పరస్పర దాడులు యద్ధం గా మారింది. హమాస్ మిలిటెంట్ సంస్థను అంతమొందించడంలో, గాజాను మరుభూమిగా మార్చడంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే ఒక యుద్ధభూమిలో వున్నారు. ఇజ్రాయెల్కు ఊపిరాడకుండా చేసి, ప్రపంచ చిత్రపటం నుంచి ఒకే ఒక్క యూదు దేశంగా వున్న ఇజ్రాయెల్ను తుడిచి వేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని దృఢ నిశ్చయంతో ఉన్నారు.
అందుకే, ఏళ్ల తరబడి హెజ్బుల్లా, హమాస్ సంస్థలపై కోట్లు వెచ్చించారు. ఆయుధ సహకారాన్ని అందించారు. ఇందుకు ఇజ్రాయెల్ ఏనాటికైనా ప్రతీకారం తీర్చుకుంటుందని ఇరాన్ నాయకత్వానికీ తెలుసు. అందుకే, ఇన్నేళ్లు ఇబ్బడిముబ్బడిగా బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు నిల్వ చేసుకుంది. ఇజ్రాయెల్ పౌరప్రాంతాలే ఇరాన్ లక్ష్యం. పశ్చిమ దేశాలతో ఒకవైపు సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తూనే, మరోవైపు ఇరాన్ అణుబాంబులను సిద్ధం చేసుకొంది.
ఇరాన్వద్ద 10 అణుబాంబులు వుండవచ్చునని ఒక అంచ నా. అందుకే, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో యుద్ధం ప్రారంభించింది. మొదట ఇరాన్ అణుస్థావరాలు, క్షిపణి స్థావరాలు, సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ విరుచుకు పడింది. ఇరాన్ భూభాగంలోకి రహస్యంగా తరలించిన డ్రోన్లతో దాడులు జరిపింది. ముగ్గురు కీలక సైన్యాధికా రులు, అణుశాస్త్రవేత్తలు మృతి చెందారు.
ఇజ్రాయెల్ మొదటిరోజు జరిపిన దాడిలో 78 మంది ఇరాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తొలుత 100 డ్రోన్లతో ప్రతిదాడికి దిగిన టెహ్రాన్, ఆ తర్వాత వందలకొద్దీ క్షిపణులను ప్రయోగించింది. టెల్ అవీవ్, జెరూసలెంలలో పేలుళ్లు జరిగాయి. శుక్రవారం రాత్రి.. రెండో రోజుకూడా టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణులు విరుచుకు పడ్డాయి. ఈ దాడిలోనూ ప్రాణనష్టం జరిగింది.
అయితే, ఇప్పటికీ ఇరాన్లో కార్యకలాపా లు సాగిస్తున్న ఇజ్రాయెల్ రహస్య గూఢచార సంస్థ మొస్సాద్, ఇరాన్లో సృష్టించనున్న బీభత్సం ఏమిటనేది పెద్ద ప్రశ్న. టెహ్రాన్కు సమీపంలోనే మొస్సాద్ ఏకంగా రహస్య డ్రోన్ స్థావరం ఏర్పాటు చేసుకొని ఇరాన్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసే పనిలో వుందని వార్తలు వస్తున్నాయి. తగిన సమ యం తీసుకుని, నిర్దుష్ట లక్ష్యంతో మొస్సార్ గతంలో హెజ్బుల్లా సంస్థపై పేజ ర్లు, వాకీటాకీలను ప్రయోగించింది.
అవి ఒకేరోజు పేలి, విధ్వంసానికి కారణమయ్యాయి. పశ్చిమాసియాను రక్తసిక్తం చేసే ఈ యుద్ధం ఆగేదెప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం కరువే. సిరియాలో అస్సాబ్ను నిర్వీర్యం చేసిన ఇజ్రాయె ల్, గత ఏడాది ఇరాన్ జరిపిన దాడులపై రగులుతూనే ఉంది. ఇజ్రాయెల్ను అంతం చేయాలని కంకణం కట్టుకున్న ఇరాన్ ఈ యుద్ధంలో ఎంతకైనా తెగిం చే ప్రమాదముంది. ఇరాన్పై పూర్తిస్థాయిలో యుద్ధం ప్రారంభించడం అమెరికాకు తెలియకుండా జరుగుతున్నదని అనుకోలేం.
పరిస్థితి చేయి దాటక ముందే ఇరాన్, అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే, ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరమవుతాయని అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేశారు. అమెరికా తనను తాను రక్షించుకోవడంతోపాటు ఇజ్రాయెల్కు కూడా అండగా ఉంటుందని ట్రంప్ స్పష్టంచేశారు. ట్రంప్తోపాటు ఫ్రాన్స్ నేత మాక్రాన్, జర్మనీ నేత ఫ్రెడ్రిక్ మెర్జ్ ఇజ్రాయెల్కు ఇదివరకే మద్దతుగా నిలిచారు.
పశ్చిమ దేశాల మద్దతుతో నెతన్యాహు మరింతగా రెచ్చిపోవ డం ఖాయం. కనుక, ఈ మారణహోమం ఇప్పట్లో ఆగేది కాదు. దీనితో గల్ఫ్ అరబ్ దేశాల్లోనూ ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఈ యుద్ధం నెతన్యాహు, ఖమేని, ట్రంప్లకు ప్రయోజనం చేకూరుస్తుందేమో గాని, ప్రపంచంలోని ఏ దేశానికీ ఇది ప్రయోజనకారి కాదు.